కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి నల్లకుంట మైసమ్మ ఆలయం వద్ద గురువారం గుర్తు తెలియని యువకుడు వంటగది షెడ్డులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొందరు అతన్ని వాడి గ్రామానికి చెందిన వాడని చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.