17ఏప్రిల్ నుండి 30వరకు కామారెడ్డి జిల్లాలోని మండల కేంద్రాల్లో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ నెల 14న సీఎం ప్రారంభించిన భూ భారతిని జిల్లాలో విస్తృతంగా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అందులో భాగంగా ప్రతీ మండల కేంద్రంలోని రైతు వేదిక లేదా ఇతర ప్రాంతాలలో భూ భారతి అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు.