కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లు తొలగించడాన్ని నిరసిస్తూ గ్రామపంచాయతీ వద్ద బుధవారం నిరసన తెలిపారు. అసలైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, కలెక్టరేట్ పాదయాత్రకు బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకుని, ఎంపీడీవో కార్యాలయంలో సమయించారు. తమకు ఇళ్లు రావడం లేదని, కలెక్టరేట్ కు వెళ్తామని లబ్ధిదారులు మొరపెట్టుకున్నారు.