తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలకు డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్పై పట్టం లేదని, రూ.9 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.