రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డికి వస్తున్నారు. ఉదయం 10గంటలకు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగే వన మహోత్సవం పాల్గొననున్నారు. అక్కడినుంచి 10: 45 గంటలకు కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి, భూభారతి సమస్యల పరిష్కారం, వ్యవసాయ శాఖకు సంబంధించి విత్తనాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షించనున్నారు.