కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ఎవరూ ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజా ధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు.