పల్వంచ(M) ఫరీద్పట్లలో ఓ మహిళపై అత్యాచారం చేసి, గాయపరిచి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బిహార్కు చెందిన రాహుల్ కుమార్ను మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో శుక్రవారం పట్టుకున్నట్లు SP రాజేష్ చంద్ర తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.