కామారెడ్డిలోని కల్కినగర్కు చెందిన తోట సాయి వినీల్, సోమవారం ప్రకటించిన JEE అడ్వాన్స్డ్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్ సాధించాడు. EWS కోటాలో 2వ ర్యాంక్ పొందాడు. తన కుమారుడి అకుంఠిత దీక్ష, పట్టుదలను తల్లిదండ్రులు ప్రేమలత, తోట శ్రీనివాస్ లు గొప్ప విజయంగా భావిస్తూ హర్షం వ్యక్తం చేశారు.