రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డిని, బుధవారం సెక్రటేరియట్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.