లింగంపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి మహిపాల్, మాచాపూర్లో జరిగిన అండర్ 14/17 కుస్తీ పోటీ టోర్నమెంట్లో జిల్లాస్థాయిలో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. నిర్వాహకులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కళాశాల ప్రిన్సిపల్ నరేందర్, అధ్యాపకులు మహిపాల్ను అభినందించారు.