కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ మార్గదర్శకత్వంలో జాగృతి మహిళా అధ్యక్షురాలు బి. వసంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జాగృతి నాయకులు, మహిళలు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పలు వార్డుల్లో తమ అభ్యర్థులు సింహం గుర్తుతో గట్టి పోటీనిస్తారని, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం పోరాడతామని బి. వసంత తెలిపారు.