
ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా చంపేస్తాం: ఇజ్రాయెల్
ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా చంపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఖమేనీ కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీకి ఇరాన్ పాలన అప్పగించినట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు, ఇరాక్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై వందలాది డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై 40కి పైగా మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ విప్లవ గార్డ్స్ కార్ప్స్ (IRGC) తెలిపింది. ఈ పరిణామాల మధ్య, ఇరాన్లో ఇప్పటివరకు 1,097 మంది మరణించినట్లు యూఎస్ మానవ హక్కుల సంస్థ నివేదించింది.




