నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిజిస్టర్లు, స్టోర్ రూమ్ను పరిశీలించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మరమ్మత్తులు చేయించాలని అధికారులకు సూచించారు.