శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన దుద్ధిల్ల

2చూసినవారు
శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన దుద్ధిల్ల
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ మాట్లాడుతూ, దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చారని అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జయంతి సందర్భంగా జిల్లా యువజన & క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్