ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలి

2చూసినవారు
ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
కామారెడ్డి జిల్లా కుప్రియల్ లోని మహాత్మ గాంధీ జ్యోతిబా ఫూలే పాఠశాలలో గురువారం రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026ను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు ఇర్షాద్, కృష్ణ తేజ, రఫీ విద్యార్థులకు రహదారి భద్రత ప్రాముఖ్యతను వివరించారు. పాదచారులుగా, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సరళమైన భాషలో తెలియజేసి, రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్