ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన ముగ్గురు బాధితుల కుటుంబాలకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి బుధవారం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ముదెల్లి గ్రామానికి చెందిన శకుంతల, చద్మల్ గ్రామానికి చెందిన మాలవత్ సోను, లింగంపేట గ్రామానికి చెందిన సమీరా బేగం కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఈ ఎక్స్గ్రేషియా చెక్కులను ఆయన అందించారు.