కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామానికి చెందిన కొమ్ము మహేశ్ (30) అనే ప్రభుత్వ ఉద్యోగి గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సంగమేశ్వర గ్రామం నుంచి కామారెడ్డికి మోటార్ సైకిల్ పై వస్తుండగా, భారీ వర్షం నడుమ కృష్ణ మందిర్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఆయన మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.