కామారెడ్డి రూరల్ సీఐగా పనిచేస్తున్న రామన్ హైదరాబాద్లోని ఐజీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిద్దిపేట ఎస్బీలో పనిచేస్తున్న శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రామన్ జిల్లాలో దాదాపు రెండేళ్ల పాటు సదాశివనగర్, కామారెడ్డి రూరల్ సీఐగా విధులు నిర్వర్తించారు. ఆయన బదిలీ నేపథ్యంలో అనేకమంది సీఐ పదవి కోసం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.