ఎల్లారెడ్డి - లింగంపేట్ రహదారిలో గల ఏద మినిస్ట్రీస్ చర్చిలో ఆదివారం మట్టల ఆదివారం నిర్వహించారు. ఆరాధన దైవ సేవకులైన బ్రదర్ శ్రీనివాసా చారి, గాసిస్టర్ హెప్సిబా చారి తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది ఏద వర్షిప్ సెంటర్కు వచ్చి మట్టలతో ప్రార్థనలు చేశారు. ఆరాధనకు వచ్చిన వారందరూ దేవుని ద్వారా దీవించబడి వెళ్లారని వారు తెలిపారు.