మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి, ఎల్లారెడ్డి రహదారిలోని లింగంపల్లి ఖుర్ద్, అడ్విలింగాల్ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వరదల వల్ల దెబ్బతిన్న ఈ వంతెనల నిర్మాణానికి తక్షణ నిధులు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. డిప్యూటీ సీఎం నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఇతర అత్యవసర సమస్యలపై కూడా చర్చించారు.