ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 (బాలికల) ఆధ్వర్యంలో మంగళవారం నాల్గవ రోజు శిబిరం కొనసాగింది. ప్రోగ్రామ్ ఆఫీసర్ జి. రాణి తెలిపిన వివరాల ప్రకారం, వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి సమగ్ర సర్వే నిర్వహించారు. గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై వారి జీవన పరిస్థితులు, అవసరాలను తెలుసుకుంటూ, విద్య యొక్క ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు.