ఉత్తర ప్రదేశ్ లోని కాశీ పట్టణంలో నవంబర్ 27 నుంచి కోటి బిల్వార్చన మహోత్సవం ఘనంగా జరుగుతోంది. అందోల్ సెగ్మెంట్ రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఆయన శిష్యులు, వేద పండితులు ప్రణయ్ జోషి పంతులు తెలిపారు. కాశీలోని స్థానిక జంగమ సమాజ్ మఠంలో అతి రుద్ర పారాయణం, శ్రీ సూక్త పారాయణం, చండీయాగం వంటివి స్వామిజీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.