తాడ్వాయి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్ల రవిసాగర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నందివాడ శివారులో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తున్న అనిల్, రవిసాగర్ నడుపుతున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రవిసాగర్ మృతి చెందగా, అనిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.