ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపిసిస్, బీజెడ్సీ, బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మంది విద్యార్థినులు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ స్కాలర్ షిప్ కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థినులలో బీఎస్సీ ఎంపిసిస్ నుండి కుర్మ దివ్య, దాసరి చరణ్య, అవుసుల భార్గవి; బీజెడ్సీ నుండి తోట అనురాధ, మాచ బోయిన వెన్నెల, నమ్మతోట పూజిత, ల్యాగల అఖిల, అద్దె అఖిల, కతూరి వాగ్నేయ; బీఏ మొదటి సంవత్సరం నుండి వైష్ణవి; బీఎస్సీ ఎంపిసి నుండి నాయక స్పందనలు ఉన్నారు.