మంగళవారం నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. గౌరవ అధ్యక్షులు బొల్లు నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో గుర్రాల సిద్దయ్య అధ్యక్షులుగా, వివేక్ రెడ్డి వైస్ చైర్మన్గా, వెంకట్ రెడ్డి కోశాధికారిగా ఎన్నికయ్యారు. పలువురు సభ్యులు కూడా నూతన కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు.