ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

2చూసినవారు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు బుధవారం జుక్కల్, పిట్లం మండల కేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. సమావేశం అనంతరం ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఎమ్మెల్యేని సత్కరించారు.
Job Suitcase

Jobs near you