బోగస్ ఓటర్లను తొలగించేందుకు ఓటర్ జాబితాను పకడ్బందీగా సవరించాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ సూచించారు. బుధవారం మీసాన్ పల్లి గ్రామ రైతువేదికలో బిఎల్ఓలకు ఓటర్ జాబితా సవరణపై శిక్షణ ఇచ్చారు. 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ద్వారా నిజమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ట్రైనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.