ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గురువారం 99 రోజుల పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు వార్డు సభలు జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభల్లో వార్డు సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల అవశ్యకత వంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రజలు వార్డు సభలకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.