కన్నడ నటుడు రిషభ్ శెట్టి నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ సినిమా సెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ సినిమాలో నటిస్తున్న నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ గుండెపోటుతో మరణించారు. గురువారం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రిలో తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.