గోవాలో జరిగిన IFFI కార్యక్రమంలో ‘కాంతార’ సన్నివేశాలను హాస్యంగా అనుకరించి, చాముండి దేవతను ‘దెయ్యం’గా పేర్కొన్న వ్యాఖ్యలతో రణ్వీర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. హిందూ జనజాగృతి సమితి ఆయనపై పణజి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రణ్వీర్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపించిన సమితి, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.