హైమస్ లైట్ కు మరమ్మత్తులు చేపట్టిన మాజీ వార్డు సభ్యులు

బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఉన్న హైమస్ లైట్ వెలగక రాత్రి వేళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే, మాజీ 8వ వార్డు సభ్యులు తస్లీమా-మహమ్మద్ వెంటనే స్పందించి శుక్రవారం మరమ్మత్తులు చేపట్టారు. లైట్ సమస్యను పరిష్కరించి, తిరిగి వెలిగేలా చేయడంతో ప్రజలు వారిని అభినందించారు.
