బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను బోయినపల్లి ఎస్ఐ రమాకాంత్ పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి అప్పగించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.