బోయినపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులు గుంటి శంకర్, కేసీఆర్పై సిట్ విచారణకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయనను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉందని, రాజకీయ వేధింపులకు భయపడేది లేదని, అధికారం శాశ్వతం కాదని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని గుంటి శంకర్ అన్నారు. మహనీయులను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు.