బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన పలువురు భక్తులు శనివారం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకోవాలనే సంకల్పంతో ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మోహన్, లక్కీ, తిరుపతి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.