జగిత్యాల: 'వరి నారుకు బిందెలతో నీళ్లు పోస్తున్నారు'

72చూసినవారు
వర్షాలు కురవకపోవడం, నీళ్లు సరిగా లేకపోవడం, కరెంట్ సరఫరా జరగకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులకు ఈ దృశ్యాలే సాక్ష్యం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్ ఫార్మర్ పాడై కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయి. వరి నారు ఎండిపోకుండా బిందెలతో రైతులు నీళ్లు పోస్తున్నారు. పది రోజులైనా ట్రాన్స్ ఫార్మర్ కు మరమ్మతులు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్