మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పొనగంటి మధు తన 100 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ హుజురాబాద్లో ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఆదరణ తగ్గిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే నమ్మకంతో పార్టీలో చేరినట్లు పొనగంటి మధు తెలిపారు.