సీఐడీ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందన

తనకు, కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇబ్బందులు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాజకీయాలు తనపై చేయాలని, కానీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
