జిల్లా కొరోబార్లు, బిల్ కలెక్టర్స్ నూతన జేఏసీ కార్యవర్గం ఎన్నిక ఆదివారం జగిత్యాల పట్టణంలో జరిగింది. చైర్మన్ గంగామల్లు, గౌరవ అధ్యక్షులు కిరణ్, వైస్ చైర్మన్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి సురేశ్, కోశాధికారి వేముల భరణి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, రమేశ్, రాకేశ్, మీడియా ఇంచార్జి రమేశ్, పాషా, గంగాధర్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో నూతన బాధ్యులకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.