చొప్పదండి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి టి.తరుణ్ కుమార్ అండర్-17 విభాగంలో జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్ 8 నుంచి రాజస్థాన్లో జరిగే ఎస్జీఎఫ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున తరుణ్ పాల్గొంటాడు. విద్యార్థి ప్రతిభను డీఈఓ మొండయ్య అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని సూచించారు.