బుధవారం, కలెక్టర్ గరిమా అగ్రవాల్ బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వంటగది, బియ్యం, పప్పులు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసి, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు.