రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం, 31 జనవరి 2026న ఏకాదశ బ్రహ్మోత్సవాలు చివరి రోజున మహా పూర్ణాహుతి, చక్రస్నానం, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, ధ్వజారోహణ కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. ఆలయ ఆచార్యులు ఉ.వే. శ్రీమాన్ తి.న.చ కృష్ణమాచార్య సిద్దాంతి స్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో నిర్వాహకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.