కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న SI ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.