కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి రద్దు చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడమే దీనికి కారణమని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించబడవని, ఆ తర్వాత యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.