బోయినపల్లి మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య తనను అదే గ్రామానికి చెందిన గోలి సందీప్ రెడ్డి కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సందీప్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ నిమిత్తం శనివారం వేములవాడ డి.ఎస్.పి శ్రీనివాస్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్, పోలీస్ సిబ్బంది దుండ్రపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.