2002లో ఓటర్ల సవరణ సమయంలో అర్హుల ఓట్లు తొలగించబడలేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను తొలగించే ప్రక్రియ చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో కోటి ఓట్లు, హుస్నాబాద్లో 61 వేల ఓట్లు తటస్థంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి పౌరుడు రెండు ఫోటోలతో బీఎల్ఓ, బీఎల్ఏలకు సమాచారం ఇచ్చి ఓటు నమోదు చేసుకోవాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నామని, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.