బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో పెరుమాండ్ల సంజీవయ్య (78) అనే వృద్ధుడు వడదెబ్బతో మృతిచెందాడు. తీవ్రమైన ఎండలను తట్టుకోలేక బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేసవి తాపం నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండలో తిరగకుండా తగినన్ని నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.