కరీంనగర్ జిల్లా అలుగునూరులో రవి-లలిత దంపతుల మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో, పోలీసుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరకు 'మాకు పిల్లలు వద్దు' అని స్టేషన్లోనే వారిని వదిలేసి వెళ్లడంతో, ఆ పసి హృదయాలు కొంతసేపు అనాథలయ్యాయి. తల్లిదండ్రులే తమను వద్దనుకుంటే ఆ పసిప్రాణాలు ఎక్కడికి వెళ్లాలని అక్కడున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సమాజానికి సిగ్గుచేటు అని పలువురు అభిప్రాయపడ్డారు.