బోయినపల్లి మండలం కోరేం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 597ను ఉపసంహరించుకుంది. జీవో 199 ద్వారా పాత పాలకవర్గాలను కొనసాగించాలని ఆదేశించింది. దీంతో డీసీవో ఆదేశాల మేరకు కోరేం పాక్స్ చైర్మన్గా తీపిరెడ్డి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, మాజీ వార్డు మెంబర్, సెక్రటరీ, సిబ్బంది పాల్గొన్నారు.