కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటకు చెందిన దేశిని రాజు గౌడ్ అనే గీత కార్మికుడు, తన వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కబోతూ ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు, అతన్ని వెంటనే శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సాదయ్య, MPTC సదానందం రాజును పరామర్శించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
12:33 pm,31st Oct 2025