ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు న్యాయమూర్తులు ఈ అవకాశాన్ని కల్పించారు. కక్షిదారులు ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమతో పాటు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.